బ్రేకింగ్.. మరో పాన్ ఇండియా మూవీలో అనుష్క శెట్టి..

ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. మరో ఇంట్ర‌స్టింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో అనుష్క జాయిన్ అయినట్లు సమాచారం. ఫాంటసీ హారర్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ గురువారం మేకర్స్ రిలీజ్ చేశారు. హీరో జై సూర్య‌ పుట్టినరోజు సందర్భంగా ఈ గ్లింప్స్ రిలీజ్ చేశారు. రోజిన్ థామస్ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందించబడుతుంది. ఇందులో అనుష్క శెట్టి కీరోల్‌లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అతేంద్రీయ శక్తులు ఉన్నాయని నమ్మే కేరళ పూజారి కడమత్తత్తు కథనార్ కు సంబంధించిన వాస్తవ కథనాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. రెండు నిమిషాల టైం లో రిలీజ్ అయిన ఆ గ్లింప్స్‌ చూస్తే జయసూర్యను చర్చి అధికారులకు ఖైదీగా బందించిన‌ట్లు చూపించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకునేలా ఉన్న ఈ టీజర్ లో అతని వల్ల చర్చికి హాని ఉందని.. అతడు దుష్టశక్తులు కలిగి ఉన్నాడని ఆ కారణంతోనే అతని బంధించినట్లు చూపించారు. మరోపక్క గ్రామస్తులు వ్యాధితో బాధపడుతున్నారు అన్న కోణంలో గ్లింప్స్‌ ఉంది.

 

ఇక చివరిలో ఆర్ రామానంద్ రాసిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుందని.. అందులో ఒకటి 2024 లో విడుదల అవుతుంది అంటూ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా మొత్తం పాన్ ఇండియా లెవెల్ లో 14 భాషల్లో రిలీజ్ కానుంది. ఇక వర్చువ‌ల్‌ ప్రొడక్షన్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందుతున్న తొలి మూవీ ఇదే కావడం విశేషం. ఇక టీజర్‌తోనే వణుకు పుట్టించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి ఉండడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.