మరోసారి రిపీట్ కాబోతున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో..ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చే న్యూస్ ఇది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భలే సెట్ అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఆ కాంబో సెట్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందా..? మరికొన్నిసార్లు అదే కాంబో రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు . అదే విధంగా రిపీట్ అవుతూ ఉంటాయి కూడా.. కాగా అలాంటి కాంబోలో ఒకటే ఎన్టీఆర్ – రాజమౌళి .

వీళ్ళ కాంబోలో వచ్చిన ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . అంతేకాదు వీళ్ళ కాంబోలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగ రాయడంతో వీళ్ళ కాంబో మళ్లీ మళ్లీ రావాలి అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్న ఈ కాంబో మళ్లీ మరోసారి రాబోతున్నట్లు తెలుస్తుంది .

రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా అనే సినిమాకు సమర్పికుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కె పాత్రలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తుంది . రాజమౌళి కోరిక ప్రకారమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!