మళ్ళీ ఎన్టీఆర్ కు మండించిన ఫ్యాన్స్.. మింగలేక కక్కలేక సైలెంట్ గా వెళ్ళిపోయిన తారక్..ఏమైందంటే..?

ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో.. సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే నందమూరి నట వారసుడిగా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. దానికి కారణం చంద్రబాబు అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏం మాట్లాడకుండా ఉండడమే అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు . సొంత మామ అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది .

అయితే ఇదే క్రమంలో సైమా అవార్డ్స్ కోసం దుబాయ్ వెళ్లిన ఎన్టీఆర్ రెడ్ కార్పెట్ పై నడుస్తూ ఉండగా అక్కడ ఉండే ఆయన అభిమానులు జై ఎన్టీఆర్ ..జై జై ఎన్టీఆర్ అనే నినాదాలు తో పాటు సీఎం ఎన్టీఆర్ కాబోయే సీఎం ఎన్టీఆర్ అంటూ ఓ రేంజ్ లో అరిచి రచ్చ రంబోలా చేశారు . దీంతో ఒక్కసారిగా కోపం కట్టెలు తెంచుకున్న తారక్.. వాళ్ళవైపు ఒక్కసారిగా ఉరిమి చూసి సైలెంట్ గా ఏం చేయలేక ఏమనకుండా ముందుకు వెళ్లిపోయారు.

ఇలా జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు గతంలో కూడా చాలాసార్లు ఎన్టీఆర్ ని సీఎం అంటూ అరుస్తూ వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ అలా అనవద్దు అంటూ ఫుల్ వార్నింగ్ కూడా ఇచ్చారు . కానీ ఈసారి సైమా అవార్డ్స్ లో ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా వెళ్లిపోయాడు . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే తారక్ ఏం మాట్లాడిన రచ్చ రంబోలా చేసి రాద్ధాంతం చేస్తారని అందుకే మింగలేక కక్కలేక సైలెంట్ గా వెళ్ళిపోయాడు అంటూ ప్రచారం జరుగుతుంది..!!