సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీదేవి రెండో కూతురు..

దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అయితే ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్న సంగతి తెలిసిందే. జాన్వి కపూర్, ఖుషి కపూర్. జాన్వి అల్రెడీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాలో నటిస్తుంది.

ఇక ఇప్పుడు జాన్వి కపూర్ చెల్లెలు ఖుషి కపూర్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఖుషి కపూర్ ఓ తమిళ మూవీని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు.. దానికి సంబంధించిన అగ్రిమెంట్ పనులు కూడా పూర్తయినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలు ఖుషి తండ్రి బోనికపూర్ అధికారికంగా ప్రకటించబోతున్నారట‌. నిజానికి ఖుషి కపూర్‌కి ఇది మొదటి సినిమా కాదు.

నెట్ ఫ్లిక్స్‌లో ఆల్రెడీ ఆమె ఓ ఒరిజినల్ మూవీలో నటించింది. అయితే ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు తమిళ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతుంది. సౌత్ కు రావడానికి జాన్వి కపూర్ చాలా టైం తీసుకుంది. ముందుగా బాలీవుడ్ లో సినిమాలు నటించి అలా వచ్చిన క్రేజ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఖుషి కపూర్ అలా కాదు కెరీర్ స్టార్టింగ్ లోనే సౌత్ సినిమాల వైపు మొగ్గు చూపించింది. సౌత్ లో నిరూపించుకుని తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేయాలని ఆమె నిర్ణయించుకుందట.