దిగొచ్చిన చైనా ఆండ్రాయిడ్ కంపెనీ.. లో కాస్ట్‌లో 5జి మొబైల్..

చైనా స్మార్ట్ ఫోన్ తయారీదారులకు ఒత్తిడి కొనసాగుతున్న క్రమంలో చైనా కంపెనీ షావోమి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ షావాని సప్లయర్ డిక్సీండ్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్.. న్యూఢిల్లీ బోర్డర్లో భారీ ఫ్యాక్టరీని నిర్మించేందుకు రెడీ అయింది. దీంతో ఐఫోన్ తయారీదారు తైవాన్ కంపెనీ ఫాక్స్‌కాన్‌కి పోటీగా డిక్స‌న్‌కు షావోమి భాగాస్వామ్యం మరింత బలపడతాయని అనుకుంటున్నారు.

అయితే వైరల్ గా మారిన ఈ వార్తలపై అటు షాబోమీ గాని డిక్సన్ గాని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఫ్యాక్టరీని డిక్సన్ మూడు సంవత్సరాల్లో రూ.400 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టబోతుందని.. ప్రధానంగా ఇక్కడ షావోమి స్మార్ట్ ఫోన్ లను ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ ప్లాంట్ ను ఈనెలాఖరులో ప్రారంభిస్తార‌ట‌. అలాగే షావోమిని గతంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న బ్లూటూత్, నెక్ బ్యాండ్, ఇయర్ ఫోన్ లను తయారు చేయడానికి దేశీ ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ తో కాంట్రాక్ట్ చేసుకుందట.

ఇవి గతంలో చైనా నుంచి దిగుమతి అయ్యేవి డిక్షన్ వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రానిక్ కంపెనీ మోటరోలా, సాంసంగ్ లాంటి బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మిషన్లు, టెలివిజన్లు సహా ఇతర ఉత్పత్తుల తయారీ ఈ పరిశ్రమ చూసుకుంటుంది.3 దశాబ్దాల క్రితం ఢిల్లీ శివారులో సునీల్ ఆచాని డిక్సెన్‌ కంపెనీను స్టార్ట్ చేశాడు. కాక ఇండియన్స్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఒకప్పుడు టాప్ లో దూసుకుపోయిన షావోమి భారత కేంద్ర ప్రభుత్వం నిబంధనలు నియంత్రణలతో మార్కెట్లో భారీ నష్టాలను చెవి చూసింది. దీని నుంచి కోలుకునేందుకు మేడిన్ ఇండియా 5జి స్మార్ట్ ఫోన్లను సరసమైన ధరల్లో అందించేందుకు ప్లాన్ చేస్తోంది.