సమంత కు మరో కొత్త రోగం..? ఈసారి ఆ దేవుడే దిక్కు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. అంతే కాదు ఈ వ్యాధి కోసం ఆమె చాలా డబ్బులు ఖర్చు పెట్టి మరి విదేశాలలో చికిత్స తీసుకుంది. ఫైనల్లీ సక్సెస్ అయి పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగి వచ్చింది. అయితే ఆమె తిరిగి రాగానే తాను కమిట్ అయిన సినిమాలకు సంబంధించిన షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుని సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టింది సమంత.

అయితే సమంత రీసెంట్గా మళ్లీ మయోసైటిస్ కి గురైందని .. అందుకే ఆమె వ్యాధికి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళింది అంటూ ప్రచారం జరిగింది . అయితే సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ వైరల్ గా మారింది . సమంత ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళిన మాట వాస్తవమే కానీ .. అది మయోసైటిస్ కి కాదు అని ..ఆమె మరో కొత్త రోగం బారిన పడిందని..ఆ కారణంగానే సమంత డాక్టర్స్ దగ్గర పరీక్షించుకొని..

దానికి తగ్గ ట్రీట్మెంట్ కోసం అన్ని సర్దుబాటు చేసుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు మయోసైటీస్ కన్నా డేంజర్ కాకపోయినా ఈ వ్యాధి కూడా ఆమెకు ఇబ్బందికరంగానే అనిపిస్తూ ఉంటుందట . ఈ వ్యాధి కూడా ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్లనే ఆమెకు సోకింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది కేవలం రూమరే అంటున్నారు అభిమానులు . దీనిపై ఆమె ఎంత త్వరగా స్పందిస్తే అంత మంచిది అంటూ చెప్పుకు వస్తున్నారు.