`జ‌వాన్‌` మూవీ రెమ్యున‌రేష‌న్‌పై ఓపెన్ అయిన దీపికా.. గెస్ట్ రోల్ కు ఎంత తీసుకుందో తెలిస్తే షాకే!

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మాస్‌ యాక్షన్ థ్రిల్ల‌ర్ `జవాన్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్​ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా.. త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లను పోషించారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో మెరిసింది.

సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అనేక రికార్డులను తిరగరాస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. జవాన్ లో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించాగా దీపికా పదుకొణె అతిథి పాత్ర పోషించింది. ఎమోష‌న‌ల్ గా సాగే ఆమె పాత్ర సినిమాల‌కు బ‌లంగా మారింది. అయితే దీపికా తెర‌పై క‌నిపించేది కొద్ది సేపే అయినా.. ఈ మూవీకి ఆమె రూ. 15 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ విషయంపై తాజాగా దీపికా ప‌దుకొణె ఓపెన్ అయింది. జ‌వాన్ మూవీకి తాను పైసా కూడా రెమ్యున‌రేష‌న్ తీసుకోలేద‌ని ఆమె కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌మ‌ని ఓ భేటీలో దీపికా పుద‌కొణె పేర్కొంది. షారుక్ పై ఉన్న అభిమానంతోనే చిన్న పాత్ర అయినా జవాన్ సినిమాలో న‌టించాను.. అంతేత‌ప్పా రెమ్యున‌రేష‌న్ కోసం కాదు అంటూ దీపికా అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది.