బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ రీసెంట్ గా మాస్ యాక్షన్ థ్రిల్లర్ `జవాన్` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా.. తదితరులు కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొణె గెస్ట్ రోల్ లో మెరిసింది.
సెప్టెంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. అనేక రికార్డులను తిరగరాస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే.. జవాన్ లో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటించాగా దీపికా పదుకొణె అతిథి పాత్ర పోషించింది. ఎమోషనల్ గా సాగే ఆమె పాత్ర సినిమాలకు బలంగా మారింది. అయితే దీపికా తెరపై కనిపించేది కొద్ది సేపే అయినా.. ఈ మూవీకి ఆమె రూ. 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
ఈ విషయంపై తాజాగా దీపికా పదుకొణె ఓపెన్ అయింది. జవాన్ మూవీకి తాను పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని ఆమె కుండబద్దలు కొట్టింది. నెట్టింట జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని ఓ భేటీలో దీపికా పుదకొణె పేర్కొంది. షారుక్ పై ఉన్న అభిమానంతోనే చిన్న పాత్ర అయినా జవాన్ సినిమాలో నటించాను.. అంతేతప్పా రెమ్యునరేషన్ కోసం కాదు అంటూ దీపికా అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది.