టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ రీసెంట్ గా `ఖుషి` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పోయిన శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. క్లాస్ మూవీగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద మాస్ కుమ్ముడు కుమ్ముతోంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ. 20 కోట్లకు కలెక్షన్స్ ను సాధించింది.
అయితే సరిగ్గా గమనిస్తే విజయ్ ఖుషి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ `జనతా గ్యారేజ్` సినిమాల మధ్య మూడు కామన్ పాయింట్స్ ఉన్నాయి. జనతా గ్యారేజ్ సినిమాను కొరటాల శివ తెరకెక్కించాడు. 2016 సెప్టెంబర్ 1 విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఖుషి సినిమా కూడా సెప్టెంబర్ 1వ తేదీనే రిలీజ్ అయింది.
అలాగే ఈ రెండు సినిమాల్లోనూ సమంతనే హీరోయిన్ గా నటించింది. ఇక జనతా గ్యారేజ్, ఖుషి మధ్య ఉన్న మరొక కామన్ పాయింట్ ఏంటంటంటే.. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. జనతా గ్యారేజ్ అప్పట్లో రూ. 80 కోట్ల రేంజ్ లో వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఖుషి సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.