రామ్ చరణ్‌ని ఫ్రీగా వాడేసుకుంటున్న కంపెనీ.. పాపం ఎప్పుడు తెలుసుకుంటాడో.. శ్రీరెడ్డి కామెంట్స్ వైరల్ ..!

బోల్డ్ బ్యూటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎప్పుడు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక త‌ర‌చు మెగా ఫ్యామిలీపై సంచ‌ల‌న కామెంట్స్ చేసే శ్రీరెడ్డి మరోసారి మెగా ఫ్యామిలీ పై సెటైర్స్ వేసింది. ముఖ్యంగా రామ్ చరణ్ పాప్ గోల్డెన్ అవార్డ్స్‌కు నమినేట్ కావడాన్ని ఆస్కార్ కాదు భాస్కర్ అవార్డుకు ఎంపిక అవుతున్నాడని శ్రీ రెడ్డి కామెంట్ చేసింది.

నిజానికి పాప్ గోల్డెన్ కంపెనీకి 50 మంది సబ్ స్కైబర్స్ కూడా లేరని.. వికీ, ఐడీఎంబీ, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ లేవని ట్విట్ చేసింది. కానీ చెర్రీ ఫ్యాన్స్ మాత్రం ఏదో గొప్ప పని చేశాడని పండగ చేసుకుంటున్నారని క్యాప్షన్లో రాసుకొచ్చింది.

మొత్తానికి అమీర్ పేటలో తయారు చేసిన ఒక వెబ్‌సైట్ లాంటి కంపెనీకి చరణ్ నామినేట్ కావడం నిజంగానే చాలా గ్రేట్ అని ఇది ఫ్యాన్స్ ఎప్పుడు తెలుసుకుంటారో అని సెటైర్ వేసింది శ్రీ రెడ్డి. ఇది చూసిన చరణ్ అభిమానులు శ్రీ రెడ్డిని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.