`ఖుషి` మూవీకి విజ‌య్‌-స‌మంత రెమ్యున‌రేష‌న్స్‌ ఎంతో తెలుసా.. గ‌ట్టిగానే లాగేశారు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ `ఖుషి`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వ‌రాలు అందించాడు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానుంది.

ఇప్ప‌టికే ప్ర‌మోష‌న్స్ జోరందుకున్నాయి. ఓవైపు మేక‌ర్స్ ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ మోత మోగిస్తున్నారు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, సాంగ్స్ తో ఆల్రెడీ ఈ మూవీపై మంచి హైప్ ఏర్ప‌డింది. మ‌రోవైపు విజ‌య్-సమంత వ‌రుస ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ మ‌రింత బ‌జ్ ను క్రియేట్ చేస్తున్నారు. లైగ‌ర్, శాకుంత‌లం డిజాస్ట‌ర్స్ ను మూట‌గ‌ట్టుకున్న విజ‌య్‌, స‌మంత‌.. ఖుషితో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌ని ఆశ‌ప‌డుతున్నారు.

ఇక‌పోతే ఖుషి మూవీకి విజ‌య్, స‌మంత తీసుకున్న రెమ్యున‌రేష‌న్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీ కావ‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ రూ. 25 కోట్ల రేంజ్ లో లాగేశాడ‌ట‌. గ‌త చిత్రం లైగ‌ర్ భారీ ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ విజ‌య్ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అందుకే ఆ స్థాయిలో ఛార్జ్ చేశాడట‌. మ‌రోవైపు సమంత ఖుషి కోసం రూ. 5 కోట్లు పారితోషికం అందుకుంద‌ని అంటున్నారు. మ‌రి హిట్ కోసం ఆరాట‌ప‌డుతున్న విజ‌య్‌, స‌మంత‌ల‌కు ఈ మూవీ ఎలాంటి ఫ‌లితాన్ని ఇస్తుందో చూడాలి.