ఖచ్చితంగా సంవత్సరంలో మూడుసార్లు జాన్వీ శ్రీవాని దర్శించుకుంటుంది.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే .. తనకంటూ ప్రత్యేక ముద్రను వేయించుకున్న శ్రీదేవి ఇప్పుడు మన మధ్య లేకపోవచ్చు.. కానీ తన సినిమాల ద్వారా ఇప్పటికీ మన మధ్యనే ఉంది . కాగ ఆమె పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరి ముఖ్యంగా ఆమె తెలుగులో ఎన్టీఆర్ తో ఎంట్రీ ఇవ్వబోతుంది అని తెలుసుకున్న జనాలు.. మరింత స్థాయిలో ఆమె పేరుని ప్రమోట్ చేస్తున్నారు .

ఇప్పటికే దేవర సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ పిక్చర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది . అయితే ఇలాంటి క్రమంలోనే జాన్వి కపూర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటుంది . కనీసం సంవత్సరానికి ఆరు ఏడుసార్లు అయినా సరే జాన్వి కపూర్ తిరుమల వెళ్లి దేవుడిని దర్శించుకుని వస్తుంది. అయితే దాని వెనక పెద్ద రీజనే ఉంది. శ్రీదేవికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా నమ్మకం ..భక్తి .. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సరే ముందుగా ఆయనకు చెప్పిన తర్వాతే ఇంట్లో చెబుతుంది .

శుభకార్యాలైన .. సినిమా ప్రాజెక్ట్స్ అయినా ఏదైనా సరే అందుకే జాన్వికపూర్ కి సైతం ఆమె అలవాట్లు వచ్చాయి. అంతేకాదు జాన్వి కపూర్ ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలన్న ఏ మంచి పని స్టార్ట్ చేయాలన్న.. తన పుట్టినరోజు తన తల్లి పుట్టిన రోజు ఏ రోజైనా సరే ముందుగా శ్రీవారి ని దర్శించుకున్న తర్వాతే మిగతా పనులు స్టార్ట్ చేస్తుందట . ఆ కారణంగానే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఎక్కువ తిరుమల వెళ్తుంది అంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!