చైతు పాట‌కి ఏడ్చేసిన స‌మంత‌.. మాజీ భ‌ర్త‌ను ఇంకా మ‌ర్చిపోలే.. వీడియో వైర‌ల్‌!

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం `ఖుషి` మూవీ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంటర్టైన‌ర్ సెప్టెంబ‌ర్ 1న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ఖుషి మ్యూజిక్ కన్సర్ట్ ను నిర్వ‌హించారు.

ఈ ఈవెంట్ లో విజ‌య్-స‌మంత స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అయ్యారు. అలాగే ఈ కార్యక్రమం ఆద్యంతం మ్యూజిక్ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ మ్యూజిక్ కన్సర్ట్ లో ఖుషి సాంగ్స్ తో పాటు విజ‌య్‌, స‌మంత‌ గ‌త సినిమాల‌ సాంగ్స్ ను కూడా పాడాడు. ఈ క్ర‌మంలోనే ఒక సింగర్ స్టేజి పైన మజిలీ సినిమాలోని ‘ప్రియతమా ప్రియతమా’ సాంగ్ ని పాడి వినిపించారు. అయితే ఆ సాంగ్ పాడుతున్న స‌మ‌యంలో స‌మంత ఏడ్చేసింది.

‘ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా…’ లిరిక్స్ వస్తున్నప్పుడు స‌మంత క‌ళ్ల‌ల్లోకి క‌న్నీళ్లు వ‌చ్చేశాయి. కానీ, ఆ క‌న్నీళ్లను త‌న ఎక్స్ప్రెషన్స్ తో ఆమె క‌వ‌ర్ చేసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. మాజీ భ‌ర్త‌ను స‌మంత ఇంకా మ‌ర్చిపోలే అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా, నాగ‌చైత‌న్య, స‌మంత జంట‌గా శివ నిర్వ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న `మ‌జిలీ` బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. పెళ్లి త‌ర్వాత చైతు, స‌మంత చేసిన తొలి చిత్ర‌మిది. ఇందులో వారి కెమిస్ట్రీ నెక్స్ట్ లెవ‌ల్ అనే చెప్పొచ్చు.

 

View this post on Instagram

 

A post shared by GMS Beats 🫂💕 (@gnms_editss)