ఇద్దరు సూపర్ స్టార్లకు యంగ్ హీరో శర్వానందే విలన్..!!

జైలర్ సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రజినీకాంత్ తన తదుపరి చిత్రాలపైన మరింత ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.. దాదాపుగా రూ .500 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టిన జైలర్ సినిమా కోలీవుడ్ లోనే ఈ ఏడాది బిగ్గెస్ట్ గా నిలిచింది.. దాదాపుగా 10 సంవత్సరాల వరకు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో కం బ్యాక్ ఇచ్చారని చెప్పవచ్చు.. తన నెక్స్ట్ సినిమాని జై భీమ్ డైరెక్టర్ TJ జ్ఞానవెల్ చేయబోతున్నారు.

అయితే ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వినపడలేదు ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో బిగ్బి అమితాబచ్చన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. దీంతో రజనీకాంత్ అమితాబచ్చన్ కాంబినేషన్ లో సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.. ముఖ్యంగా డైరెక్టర్ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు అంటే ఈ సినిమా లో ఉంటుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.. ఈ సినిమా మాస్ కమర్షియల్ సినిమా కాకుండా సరికొత్త కదా తెరకెక్కించే అవకాశం ఉన్నట్టు సమాచారం…

ఈ సరికొత్త ప్రాజెక్టు రజనీకాంత్ ఎక్కువ డేట్లు ఇవ్వలేదని సమాచారం.. దీన్ని బట్టి చూస్తే రజనీకాంత్ కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటుడు శర్వానంద్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. రజినీకాంత్, అమితాబచ్చన్ లకు విలన్ గా శర్వానంద్ నటించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంపై చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటిస్తుందేమో చూడాలి మరి..