పూజా హెగ్డే దరిద్రం మరీ ఇంత దరిద్రంగా ఉందా..? తల ఎక్కడ పెట్టుకుంటుందో..?

కొన్నిసార్లు దరిద్రం ఎంత దరిద్రంగా పట్టుకుంటుంది అంటే అదృష్టానికన్నా ముందు దరిద్ర దేవత వెళ్లి అక్కడ తిష్ట వేస్తుంది అని అంటుంటారు మన ఇంట్లోనే పెద్దవాళ్ళు. బహుశా పూజా హెగ్డే విషయంలో ఇది నిజమే అనిపిస్తుంది . లేకపోతే ఆమె కోసం రాసుకున్న కథలు కూడా వేరే హీరోయిన్స్ దొబ్బేస్తూ ఉండడం ..ఆమె తీసిన సినిమాలు డిజాస్టర్ గా మారుతూ ఉండడం.. దీనికన్నా ప్రూఫ్ ఇంకొకటి ఉంటుందా..? అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.

రీసెంట్గా పూజ హెగ్డే కి సంబంధించిన మరో విషయం నెట్టింట వైరల్ గా మారింది. గతంలో సినిమా ఇండస్ట్రీలో సినీ చరిత్రను తిరగరాసిన హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో హీరోయిన్గా మొదటగా పూజ హెగ్డే అని అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ . అప్పటికే రాధే శ్యామ్ సినిమా షూట్ లో బిజీగా ఉండడంతో పూజ హెగ్డే ఈ ఆఫర్ ని సున్నితంగా రిజెక్ట్ చేసిందట. దీంతో ఈ ఆఫర్ మృణాల్ చేతికి వెళ్ళింది .

అంతేకాదు ఈ సినిమాలో మొదటిగా రష్మిక పాత్రకు కూడా రాశిఖన్నాని అనుకున్నారట . అయితే రాశి ఖన్నా ఇది గెస్ట్ పాత్ర అంటూ రిజెక్ట్ చేసింది అట. ఇలా ఇద్దరు హీరోయిన్స్ మంచి పాత్రను మిస్ చేసుకున్నారు. అంతేకాదు పూజా హెగ్డే కెరియర్ ఆ తర్వాత ఎంత డిజాస్టర్ అయిందో మనకు తెలిసిందే . మృణాల్ ఠాకూర్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకుంది . ఇలా పూజా హెగ్డే దరిద్రం ఇంత దరిద్రంగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్నారు జనాభా..!!