ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లీడర్ అంటు సంచలన ట్విట్ చేసిన పూనామ్ కౌర్.. ఎవరినంటే..?

ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. గత కొద్దిరోజుల క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వలంటర్లు పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల నుంచి వలంటర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను కూడా కాల్చివేస్తున్నారు. క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ వాలంటరీలో కోరుతున్నారు. మానవ అక్రమ రవాణాకు వాలంటరీలు పాల్పడుతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ విమర్శించడంతో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.

Poonam Kaur on Telugu director who pushed her into depression: He said if I die, it's a news for a day - India Today

వారహి యాత్ర సందర్భంగా ఏలూరులో నిర్వహించిన ఈ సభలో ఆయన వలంటర్లు లను తప్పుపట్టడం జరిగింది. 17,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అంటూ వాదించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వలంటీర్ల పైన విరుచుకు పడడం జరిగింది. వీరు చేసిన వ్యాఖ్యలపైన ఇప్పటికే ఎంతోమంది వైయస్సార్సీపీ నాయకులు కూడా ఎదురు దాడి చేయడం జరిగింది. వలంటర్ల పైన చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు సైతం మాట్లాడడం జరిగింది.

 

అయితే దీనిపైన తాజాగా ప్రముఖ నటి పూనమ్ కౌర్ స్పందించడం జరిగింది .జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకు పరోక్షంగా చురకలు అంటించడం జరిగింది. ఏపీలో నకిలీ నాయకులు తిరుగుతున్నారంటూ హెచ్చరించింది. ఈ సందర్భంగా పూనమ్ కౌర్ గతంలో వినేష్ పోగొట్ సాక్షి మలిక్ చేపట్టిన ఆందోళన గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఏపీలో మహిళలకు ఏదో జరుగుతోందంటూ గొంతు చించే నాయకులు తయారయ్యారంటూ పూనమ్ కౌర్ ఒక సంచలన ట్విట్ చేసింది. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చేసిన నాయకుల పట్ల జాగ్రత్తగా వహించండి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానంటూ తెలియజేసింది ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.