పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ హీరో గానే కాకుండా జనసేన పార్టీ అధినేతగా కూడా వ్యవహరిస్తూ తాజాగా ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చి 2.4 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి లేటుగా ఎంట్రీ ఇచ్చిన సరే అతి తక్కువ సమయంలోనే ఊహించని స్థాయిలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు అంటూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ అయితే ఇందులో చిరంజీవితో పనిచేసిన నటీనటులు సైతం తన కుటుంబంలోని వారందరినీ కూడా ఇందులో షేర్ చేయడం జరిగింది.
అయితే ఈ వీడియోలో మోహన్ బాబు ,ఆలీ కనిపించకపోవడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది .పవన్ కళ్యాణ్ కావాలని వీరిద్దరిని వీడియోలు ప్రాధాన్యత ఇవ్వలేదన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తనతో పని చేసిన చిన్న నటులకు కూడా ప్రాధాన్యత ఇచ్చిన పవన్ కళ్యాణ్ మోహన్ బాబు ,ఆలీకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ వైసీపీ పార్టీకి చెందినవారు కావడంతో వీరి మద్దతు తనకు రాదని తెలిసి పోస్ట్ చేయలేదంటూ పలువురు నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
సినీ సెలబ్రిటీలు అందరినీ కూడా పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాల పరంగా వాడుకోవాలని చూస్తున్నారంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ ఈ వీడియో ద్వారా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి కూడా కొన్ని స్టిల్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. పవన్ సినిమాలన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నాయి. మరి ఈ చిత్రాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి మరి.
View this post on Instagram