పూజా హెగ్డే సంచలన నిర్ణయం.. వేణుస్వామీతో ప్రత్యేక పూజలు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ పూజ హెగ్డే ..కెరియర్ ఎలా డిజాస్టర్ గా మారిందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో ఎక్కువ హిట్స్ కొట్టిన హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే కెరియర్ మొదట్లో కూడా ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ ని ఫేస్ చేసిందో మనకు తెలిసిందే.

ఆ తర్వాత ఎలాగోలా హిట్ కొట్టిన పూజ ఆ తర్వాత ఫ్లాప్ అంటూ తెలియని హీరోయిన్ గా రాజ్యమేలేసింది. కానీ పూజ హెగ్డే లాస్ట్ గా నటించిన నాలుగు సినిమాలు డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే ఆమెకు అవకాశాలు ఇవ్వడమే మానేశారు డైరెక్టరర్లు. అంతేకాదు ఆమె చేసిన ఫోటో షూట్ సైతం డిజాస్టర్ గా మారుతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలోనే వేణు స్వామిని కలవబోతుంది పూజ హెగ్డే అన్న వార్తలు ఎక్కువగా వినపడుతున్నాయి.

మనకు తెలిసిందే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి చెప్పిందే జరుగుతుంది అని ఇప్పటికే ఇండస్ట్రీలో ఉండే సగానికి మందికి పైగా జనాలు నమ్ముతున్నారు . ఇలాంటి క్రమంలోనే వేణు స్వామి ఒక్కడే తన కెరీయర్ని బాగు చేస్తాడని.. ఆయనతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి సిద్ధపడిందట పూజా హెగ్డే . ఇప్పటికే ఆయనను కలిసి ఆయన అపాయింట్ మెంట్ తీసుకొని ప్రత్యేక పూజలకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుందట . ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మళ్లీ పూజ జెట్ స్పీడ్ లో బౌన్స్ బ్యాక్ అవుతూ ఇండస్ట్రీలో పాగ వేయడం కన్ఫామ్ అంటున్నారు సినీ ప్రముఖులు..!!