నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ కుమార్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు.
షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన పోస్టర్స్, టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అఖండ, వీర సింహా రెడ్డి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. భగవంత్ కేసరితో హ్యాట్రిక్ కొడతాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బాలీవుడ్ లో 1992 లో వచ్చిన `ఖుదా గవా` అనే సూపర్ హిట్ మూవీకి భగవంత్ కేసరి రీమేక్ అట. ఇందులో అమితాబ్ బచ్చన్, శ్రీదేవి, నాగార్జున నటించారు. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం శతృవుని చంపుతాడు హీరో అమితాబ్ బచ్చన్.
అదే సమయంలో స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మరోపక్క ఇతనెవరో తెలియకుండా మరో చోట కూతురు పెరిగి పెద్దది అవుతుంది. అయితే ఖుదా గవా మూవీకి బాలయ్య భగవంత్ కేసరికి చాలా దగ్గర పోలికలు ఉంటాయని.. ఇంచుమించు రెండు కథలు ఒకేలా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. భగవంత్ కేసరిలో బాలయ్య చెయ్యని తప్పుకు జైలు శిక్ష అనుభవిస్తాడనే టాక్ ఉంది. అలాగే ఇందులో ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనుందని గతంలో అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. ఈ లెక్కల ఖుదా గవాకి నిజంగానే భగవంత్ కేసరి రీమేక్కా.. లేదా రెండు వేరు వేరు కథలా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.