ఈ ఆగస్టు నెల మొత్తం మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ. ఎందుకంటే, ఆ నెలలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు మెగా హీరోల నుంచి రాబోతున్నాయి. అవును, ఆగస్టు నెల మొత్తాన్ని మెగా హీరోలే బుక్ చేసేసుకున్నాడు. మరి వారెవరో ఓ లుక్కేసేయండి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 11 న విడుదల కానుంది.
అలాగే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ `గాండీవధారి అర్జున`. యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకి దర్శకత్వం ప్రవీణ్ సత్తారు వహిస్తున్నారు. నిర్మాత బి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య ఇందులో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు.
ఆగస్టు నెలలో మరో మెగా హీరో మూవీ విడుదల కాబోతోంది. అదే వైష్ణవ్ తేజ్ `ఆది కేశవ`. ఇందులో యంగ్ నెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. వైష్ణవ్ తన కెరీర్లో తెరకెక్కిన తొలి యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ఈ మూవీని ఆగస్టు 18న గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేశారు. అలా ఆగస్టులో మెగా హీరోల నుంచి మూడు సినిమాలు కాబోతున్నాయి. అయితే వీటి కంటే కొద్ది రోజుల ముందే పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ మల్టీస్టార్ `బ్రో` కూడా ప్రేక్షకులను అలరించబోతోంది. జూలై 28న బ్రో థియేటర్స్ లో సందడి చేయనుంది.