టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ముద్దుల కుమార్తె సితార రీసెంట్ గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పీఎంజే జ్యూవెల్లరీస్ కు సితార బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఆ బ్రాండ్ జ్యూవెల్లరీని ప్రమోట్ చేస్తూ సితార కొద్ది రోజుల క్రితం ఓ యాడ్ లో నటించగా.. అందుకు సంబంధించిన ఫోటోలను ఏకంగా న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించారు.
అతి చిన్న వయసులో సితార ఇటువంటి రేర్ ఫీట్ ను అందుకోవడంతో అభిమానులు ఎంతగానో మురిసిపోయారు. మహేష్ బాబు కూతురా మజాకా అంటూ సితారకు అభినందనలు తెలిపారు. అలాగే సదరు బ్రాండ్ ప్రమోషనల్ యాడ్ కోసం సితార ఏకంగా కోటి రూపాయిలు రెమ్యునరేషన్ కూడా తీసుకుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదీ ఒక రికార్డే అని చెప్పాలి. అయితే ఇప్పుడు సితారకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.
అదేంటంటే.. సితార నెక్స్ట్ టార్గెట్ మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ పోటీలే అట. సితార తల్లి నమ్రతకు అందాల పోటీల్లో మంచి పట్టుంది. 1993 లో ఆమె మిస్ ఇండియాగా కూడా ఎంపికైంది. ఇప్పుడు తల్లి సూచనలతోనే సితార ఈ పోటీలకు రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకు అన్ని అర్హతలు పొందడం కోసం సితార అడుగు వేస్తోందట. ఇదే కనుక నిజమైతే సితార హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమవుతుంది.