23ఏళ్ల తరువాత మళ్లీ ఆ హీరోయిన్ తో నాగార్జున బంచిక్ బం.. సిల్వర్ స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారిపోయింది . అక్కినేని నాగార్జున హిట్ కోసం ఆ హీరోయిన్ ని వాడుకుంటున్నాడా..? అంటే అవును అని అంటున్నారు అభిమానులు . అంతేకాదు దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ హీరోయిన్ తో జతకడుతూ సినిమా ఇండస్ట్రీ లెక్కలను తిరగరాయడానికి సిద్ధమవుతున్నాడు . ప్రజెంట్ అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ట్రెండింగ్ లోకి వస్తున్నాయో మనకి బాగా తెలిసిన విషయమే .

కాగ ఒక్కటంటే ఒక హిట్ కొట్టలేకపోతున్న తండ్రి కొడుకులు ఎలాగైనా సరే ఈసారి 100 కోట్ల క్లబ్ లోకి చేరాలని బాగా ఫిక్స్ అయిపోయారట . ఈ క్రమంలోనే నాగార్జున తన తదుపరి సినిమాను అజయ్ భూపతి తో ఫిక్స్ అయ్యాడు అంటూ తెలుస్తుంది. ఆర్ఎక్స్ 100 – మహాసముద్రం లాంటి సినిమాలు తీసిన ఈ డైరెక్టర్ ప్రజెంట్ మంగళవారం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిపోగానే నాగార్జునతో ఒక క్రేజీ ఫిలిం చేయడానికి ఫిక్స్ అయిపోయాడట అజయ్ భూపతి .

ఈ క్రమంలోనే ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా హాట్ ఎవర్గ్రీన్ బ్యూటీ టబును ఫిక్స్ చేసుకున్నారట . ఈ క్రమంలోనే తెరపై నాగార్జున టబు జంటకు ఎంత పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అన్న కామెంట్లు కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున సైతం ఇందుకు ఒప్పుకోవడం గమనార్హం. నాగార్జునతో ఎప్పుడెప్పుడు రొమాన్స్ చేద్దామని వెయిట్ చేసే టబు కూడా ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట . దీంతో త్వరలోనే ఈ జంట తెరపై మరింత హాట్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి హిట్ కోసం నాగార్జున టబుని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది..!!