పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.
ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే రీసెంట్ గా ప్రభాస్ `ఆదిపురుష్` తో వచ్చాడు. ప్రభాస్ కెరీర్ లోనే తొలిసారి ఈ మూవీ కోసం మైథలాజికల్ సబ్జెక్ట్ ను టచ్ చేశాడు. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సైతం ఆశించిన స్థాయిలో విజయం సాధించడలేదు. ఈ మూడు సినిమాల కారణంగా రూ. 250 కోట్లకు పైగానే నష్టాలు వచ్చాయి.
ఇక ఇదే సమయంలో ఒక కొత్త సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రభాస్ గత మూడు సినిమాల నిర్మాణంలోనూ టీ సిరీస్ బ్యానర్ భాగం అయింది. అయితే ఈ బ్యానర్ ప్రభాస్ కు అస్సలు కలిసి రావడం లేదని.. టీ సిరీస్ బ్యానర్ పై సినిమా చేస్తే ప్రభాస్ కు ఫ్లాప్ ఖాయమని డార్లింగ్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అంతేకాదు, ఇకపై టీ సిరీస్ బ్యానర్ కు ప్రభాస్ దూరంగా ఉంటే మంచిదంటూ అభిప్రాయపడుతున్నారు. మరి ఈ సెంటిమెంట్ ను ప్రభాస్ దృష్టిలో పెట్టుకుంటారా.. లేదా.. అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా, ప్రభాస్ చేతిలో ఇప్పుడు ప్రాజెక్ట్ కె, సలార్, స్పిరిట్ వంటి చిత్రాలు ఉన్నాయి. అలాగే మారుతితో కూడా ప్రభాస్ ఈ మూవీకి కమిట్ అయ్యాడు.