టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులను ఫైనలైజ్ చేస్తూ బిజీ బిజీగా షూటింగ్స్ లో గడుపుతున్నాడు. రీసెంట్ గానే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్న తారక్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది .
అంతేకాదు మృణాల్ ఠాకూర్ సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినపడుతున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోనే తారక్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉంటున్నారు. ఇప్పటికే ఆపి ఫీజ్, కేఎఫ్సి వంటి ప్రముఖ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా మారిన తారక్.. రీసెంట్గా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయారు.
దీనికి సంబంధించిన యాడ్ కూడా ఫినిష్ చేశారు . త్వరలోనే యాడ్ రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే ఆ యాడ్లో భాగంగా ఓ పిక్ రిలీజ్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!
Malabar Gold & Diamonds announces its association with the Man of Masses NTR as their Brand Ambassador.
Here’s an uber cool picture of @tarak9999 from the brand shoot. pic.twitter.com/KJaTrXaRc0
— Ramesh Bala (@rameshlaus) June 20, 2023