ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్లు చేసిన మాధవీలత!

ఆదిపురుష్… గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది. ఫలితం ఎలాగున్నా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చాలామంది ఈ సినిమాపైన రకరాలుగా స్పందించారు. ఇక తాజాగా ఈ మూవీ పై ప్రముఖ హీరోయిన్ మాధవి లత షాకింగ్ కామెంట్స్ చేశారు.

అవును, టాలీవుడ్ హీరోయిన్ మాధవి లత కూడా తన ఇంస్టాగ్రామ్ లో ప్రభాస్ పై ఒక సంచలన పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్ అవుతోంది. ఆమె స్పందిస్తూ… “ఆదిపురుష్ సినిమా విషయంలో అందరూ డైరెక్టర్ ని విమర్శించడం సబబు కాదు. హీరోకి అందులో పాత్ర లేదా? అతను స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు , డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆయన అడగలేకపోయారా? ప్రభాస్ ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి కానీ ఈ సినిమా విషయంలో అతని తప్పు కూడా 50% ఉంది. ఏం రామాయణం చేసేటప్పుడు ఒకసారి రామాయణం తెలుసుకోరా? హీరోకి బాధ్యత ఉండదా?” అంటూ ప్రభాస్ ను ఉద్దేశించి ట్వీట్ చేసింది మాధవి లత.

దీంతో ఆ ట్వీట్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ కొంతమంది మండిపడుతున్నా, కొంతమంది మాత్రం నిజమే కదా ఒక్క దర్శకుడిని మాత్రమే నిందిస్తే తప్పు కదా! అంటూ మాధవి లతకు మద్దతు పలుకుతున్నారు. దాంతో మాధవి లత చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పాన్ ఇండియా హీరో ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా తెరకెక్కించిన చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. అయితే భారీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో కాస్త వెనకబడిందనే చెప్పుకోవాలి.