ఆ విషయంలో ఎన్టీఆర్ సో లక్కి.. పాపం మహేశ్ బాబు ఇలా బుక్కైపోయాడే..!!

ఎస్ ప్రసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ త్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు చేతిలో నుంచి తప్పించుకున్నాడు అని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. మనకు తెలిసిందే త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో అరవింద రాఘవ వీర సమేత అనే సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ హిట్ అందుకుంది .

ఈ సినిమా తర్వాత మళ్లీ వీళ్ళ కాంబోలో ఓ సినిమా రావడానికి ప్రయత్నించారట . తారక్ కూడా ఓకే అనుకున్నాక సినిమా నుంచి తప్పుకున్నాడు. దానికి మెయిన్ రీజన్ త్రివిక్రమ్ యవ్వారం తేడాగా ఉండడమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. కధ ఒక రకంగా చెప్పి డేట్స్ మరోరకంగా అడిగి చెప్పిన హీరోయిన్ కాకుండా మరో హీరోయిన్ ని చూస్ చేసుకుంటూ సినిమా టైం కి ఇంకొక హీరోయిన్ తెరపై తీసుకొచ్చి తేడా వ్యవహారాలు చేశారట. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తిక్కరేగి ఆ సినిమా నుంచి తప్పుకున్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

అయితే పాపం మహేష్ బాబు అలా తప్పించుకోలేక అడ్డంగా బుక్ అయిపోయాడు అంటున్నారు ఆయన ఫ్యాన్స్ . ప్రెసెంట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మహేష్ బాబు గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా ఎప్పుడో స్టార్ట్ అయింది . ఎప్పుడో పూర్తవ్వాల్సింది. ఇప్పటివరకు ముందుకే కదలడం లేదు ..ఇంకా 50% సినిమా షూటింగ్ పెండింగ్ లోనే ఉంది అంటూ సమాచారం అందుతుంది . దీని అంతటికి కారణం మహేష్ బాబు త్రివిక్రమ్ మధ్య సఖ్యత లేకపోవడం అంటూ ఉంటే మరి కొందరు త్రివిక్రమ్ కంటెంట్ సరిగ్గా రాసుకోలేదని.. పక్క హీరో పై కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు అని కామెంట్స్ చేస్తున్నారు .

ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అవుట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి. అది ఫేక్ అంటూ క్లారిటీ ఇచ్చేలోపే హీరోయిన్ పూజ హెగ్డే ఔట్ అంటూ మరో వార్త వైరల్ అవుతుంది. ఇలా గుంటూరు కారం సినిమాపై సోషల్ మీడియాలో గజిబిజి గందరగోళం నెలకొంది . మొత్తానికి ఎన్టీఆర్ – త్రివిక్రమ్ భారి నుండి తప్పించుకుంటే ..మహేష్ బాబు అడ్డంగా ఇరుక్కుపోయాడు అంటున్నారు ఫ్యాన్స్..!!