అల్లు అరవింద్ కి మండిస్తే రియాక్షన్ ఈ రేంజ్ లో ఉంటుందా..? మహేశ్ డైరెక్టర్ కి ఇచ్చి పడేసాడుగా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్న అల్లు అరవింద్ గురించి ఎంత చెప్పినా తక్కువే . అల్లు రామలింగయ్య వారసత్వాన్ని కొనసాగిస్తూ అల్లు అరవింద్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు . ప్రెసెంట్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ గా తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఏలేస్తున్న అల్లు అరవింద్.. ఎంత మంచివాడో కోపం వస్తే అంత చెడ్డ వాడుగా మారిపోతాడు . అయితే ఆ కోపాన్ని టైం వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది .

రీసెంట్గా మలయాళం బ్లాక్ బస్టర్ ఫిలిం 2018 తెలుగులో బన్నీ వాసు విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మంచి వసూళ్ళతో ఘనవిజయం దిశగా దూసుకుపోతుంది . ఈ క్రమంలోనే తాజాగా థాంక్యూ మీట్ నిర్వహించగా దీనికి అల్లు అరవింద్ – చందు మండేటి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు . ఈ క్రమంలోనే తమ బ్యానర్ ద్వారా రిలీజ్ అయిన 2018 మూవీ ఇంత సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు అల్లు అరవింద్. ఈ క్రమంలోనే దర్శకుడు చందు ని ఓ రేంజ్ లో పొగిడేశారు .

“చందు మొండేటి ఇండస్ట్రీకి నికాసైన డైరెక్టర్ అని ..నాతో సినిమా కమిట్ అయ్యాక చాలా మంచి ఆఫర్స్ వచ్చినా సరే.. ఎటు వెళ్లలేదని. ఈ మధ్యకాలంలో కొందరు కమిట్మెంట్ ఇచ్చి.. గీత దాటి వెళ్లిపోయారని.. వాళ్ళ గురించి నేను చెప్పడం లేదు ” అంటూ ఓపెన్ గా పేరు చెప్పకుండానే ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు పరశురామ్ ని ఉద్దేశించి ఘాటుగా కౌంటర్స్ వేశారు . . రీసెంట్గా పరశురామ్ ఒక్కడే గీత ఆర్ట్స్ బ్యానర్ కి కమిట్ అయి ఆ తర్వాత దిల్ రాజుతో మింగిల్ అయిపోయాడు .దీంతో కోపం వచ్చినా అల్లు అరవింద్ అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి అడిగి కడిగేద్దాం అనుకున్నారు. ఇండస్ట్రీలోని పెద్దలు సహాయం తో పెద్దల సజెషన్తో వద్దనుకున్నారు . ఇప్పుడు టైం వచ్చిందని పరోక్షకంగా ఏకీపారేశారు . గీతాగోవిందం వంటి సూపర్ హిట్ తర్వాత ఇంకో సినిమా పరశురాం గీత ఆర్ట్స్ కి సినిమా చేయాల్సి ఉంది. అయితే సర్కారు వారి పాట తర్వాత చేస్తారనుకున్నారు . ఇంతలోనే పరశురాం హ్యాండ్ ఇచ్చి దిల్ రాజు చెంతకు చేరారు. దీంతో సోషల్ మీడియాలో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!