ఊర్వశి రౌతేలా.. ఈ అందాల భామ గురించి పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఊర్వశి ప్రస్తుతం బాలీవుడ్ లో నటిగా దూసుకుపోతోంది. అలాగే ఇటీవల నార్త్, సౌత్ అనే తేడా లేకుండా ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ గా మారింది. స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తూ నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది.
ఈ సంక్రాంతికి విడుదలైన `వాల్తేరు వీరయ్య` చిత్రంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి `బాస్ పార్టీ` సాంగ్ లో గ్రేస్ ఫుల్ స్టెప్స్ తో అదరగొట్టింది. రీసెంట్ గా `ఏజెంట్` ఐటెం సాంగ్ లోనూ మెరిసింది. అలాగే రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రంలోనూ స్పెషల్ సాంగ్ కు కమిట్ అయింది. ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఊర్వశి రౌతేలా ఓ లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసింది.
ముంబైలో అత్యంత ధనవంతులు నివసించే ఏరియాలో ఓ బంగ్లాను ఊర్వశి రౌతేలా సొంతం చేసుకుందట. ఆధునిక సౌకర్యాలతో అత్యంత విలాసవంతంగా, ఎంతో సుందరగా ఈ ఇల్లు ఉంటుందట. ఇక ఊర్వశి కొత్త ఇంటి ఖరీదు తెలిస్తే కళ్లు తేలేస్తారు. ఎందుకంటే, ఈ లగ్జరీ హౌస్ ను ఉర్వశి ఏకంగా రూ. 190 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిందట. అగ్ర హీరోలకు కూడా ఇంత ఖరీదైన ఇళ్లు లేవు. అలాంటిది ఊర్వశి రూ. 190 కోట్లు పెట్టి ఇల్లు కొనడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.