మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, తన ఫ్రెండ్ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ పార్ట్నర్స్ లో ఒకరైన విక్రమ్ రెడ్డితో కలిసి కొత్తగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ‘వి మెగా పిక్చర్స్’ (V Mega Pictures) అని పేరుతో బ్యానర్ ను ప్రారంభించారు. అయితే ఈ బ్యానర్ లో మొదటి సినిమాను అఖిల్ అక్కినేనితో చేయబోతున్నాడని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
కానీ, ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రామ్ చరణ్ తన కొత్త బ్యానర్ లో మొదటి సినిమా అఖిల్ తో కాదట. కార్తికేయ 2 మూవీతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నిఖిల్ సిద్దార్థతో అని అంటున్నారు. నిఖిల్ తో ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నారట. వి మెగా పిక్చర్స్ తో పాటుగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం కానుంది.
ఈ సందర్భం గా ఒక పోస్టర్ హీరో బోట్ ని నడుపుతున్న స్టిల్ తో విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు నేడు బయటకు రానున్నాయి. కాగా, వైవిధ్యమైన కథలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్న నిఖిల్.. త్వరలోనే `స్పై` అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరికొద్ది రోజుల్లోనే ఈ మూవీ విడుదల కాబోతోంది.