ఇప్పుడు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోలు ఒకరిగా కొనసాగుతున్న యంగ్ లైగర్ ఎన్టీఆర్, ఇక తారక్ తన నటనతో డాన్సులతో తాతకు తగ్గ మనవడిగా తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఇక తన నటనతో తన సినిమాలతో మెప్పిస్తున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ఇక ఇప్పుడు ఇదే సమయంలో ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఎన్టీఆర్ కెరీర్ మొదటిలో ఆయన మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఏదంటే అందరూ సింహాద్రి అని అంటారు.
ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడుగా, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు, ఆ సినిమాలో భూమిక ,అంకిత హీరోయిన్ గా నటించారు. ఆ సినిమా రాజమౌళి రెండో సినిమా గా వచ్చింది. రాజమౌళి -ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా నిర్మతలకులాభాల పంట పండించిందని చెప్పాలి. ఈ సినిమా టీవీలో వస్తుంది అంటే ఇప్పటికి ప్రేక్షకులు తల తిప్పకుండా చూస్తూ ఉంటారు. రాజమౌళిని మాస్, కమర్షియల్ డైరెక్టర్గా నిలబెట్టింది సింహాద్రి సినిమానే. ఇక అదే సమయంలో నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా, ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమాకు సంబంధం ఉందని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా 2002లో రిలీజ్ అయ్యింది, సింహాద్రి 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించగా, ఎన్టీఆర్ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాని ముందుగా వి. సముద్ర దర్శకత్వంలో తెరకెక్కించాలని అనుకున్నారట. అదే టైంలో ఆది సినిమా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అప్పుడు నిర్మాతల బెల్లంకొండ సురేష్ తమ నిర్ణయాన్ని మార్చుకొని చెన్నకేశవరెడ్డి సినిమాని వినాయక్ తోనే తెరకెక్కించాలని అనుకున్నారు.
అదేవిధంగా చెన్నకేశవరెడ్డి దర్శికత్వ బాధ్యతలను వినాయక్ కి అప్పచెప్పారు. అదే సమయంలో సింహాద్రి విషయానికి వస్తే సినిమా స్టోరీ ముందుగా బాలయ్య వద్దకు వెళ్లిందట. ఈ సినిమాను బి. గోపాల్ బాలయ్యతో చేయాలనుకున్నారట. బాలయ్యకు కథ చెప్పగా ఆయనకు కథ నచ్చక పోవడంతో బాలయ్య కాదన్నారట. చెన్నకేశవరెడ్డి కథ నచ్చటంతో ఆ సినిమా షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఇక చివరికి సింహాద్రి కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్ళింది ముందుగా రాజమౌళి ఎన్టీఆర్ తో సినిమా తీయటానికి ఒప్పుకోలేదట. తరవాత నిర్మాతలు సద్ది చెప్పగా రాజమౌళి ఎన్టీఆర్ తో ఈ సినిమా తీశారట.
సింహాద్రి సినిమా రిలీజ్ అయ్యి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలిచింది. ఇలా చెన్నకేశవరెడ్డికి సింహాద్రి సినిమాకి ముందుగా అనుకున్న డైరెక్టర్లు ఒకరు చేసిన దర్శకులు ఒకరిని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాలకి సంబంధం ఉందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.