షకీలా అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీలో ఆమె ఒక సెన్సేషనల్ స్టార్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో షకీలా నటించింది. అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఆమె ఒక బ్రాండ్ అంబాసిడర్. అప్పట్లో షకీలా సినిమా వస్తోందంటే స్టార్ హీరోలు కూడా భయపడేవారు. తమ సినిమాలను వాయిదా వేసుకునే వారు.
చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన షకీలా.. ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. అయితే సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి షకీలా తన గొప్ప మనసును చాటుకుని నెటిజన్లను ఫిదా చేసింది. షకీలా ఓ అపార్ట్మెంట్ వాసుల కోసం పోరాటం చేస్తున్నారు. చెన్నైలోని చూలైమేడు ఏరియాలో గల చిత్ర రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున మధ్యతరగతి ప్రజలు నివసిస్తున్నారు.
అయితే ఆ అపార్ట్మెంట్ యాజమాన్యం అక్కడి కుటుంబాలు, బ్యాచ్ లర్స్ నుంచి అక్రమంగా మైంటెనెన్సు చార్జీలు వసూల్ చేస్తున్నారట. నెలకు ఏకంగా రూ.9 వేలు వసూలు చేస్తున్నారట. తాజాగా మైంటెనెన్సు ఛర్జీలు కట్టకపోవడంతో ఆ అపార్ట్మెంట్ కు నీళ్లు రాకుండా నిలిపివేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారట. దీంతో వారందరూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. వారికి అండగా నిలిచారు షకీలా. తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా షకీలా పేదల కోసం తన గళం విప్పారు. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. ప్రస్తుతం అధికారులు అపార్ట్మెంట్ యాజమాన్యం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.