సాయిధరమ్ తేజ్ గురించి స్పెషల్ గా చెప్పాలసిన పనిలేదు. బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా విరూపాక్ష. తేజ్ ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత నటిస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీపై అంచనాలు భారీగానే పెరిగాయి. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జంటగా సంయుక్త మీనన్ నటిస్తోంది. బ్లాక్ మ్యాజిక్ వంటి ఇంట్రెస్టింగ్ కథాంశంతో ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇక రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం అభిమానులను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ విడుదల చేయ్యగా అనుకున్నంత స్థాయిలో లేవు. ఇక ఈ సినిమాకు సెన్సార్ నుంచి ఏ సర్టిఫికెట్ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక ప్రివ్యూ షో ని నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది బయ్యర్స్ కి వేసి చూపించారు మేకర్స్ నుంచి అదిరిపొయ్యే రెస్పాన్స్ కూడా వచ్చింది.
సాయిధరమ్ తేజ్ కు ఇది మంచి కం బ్యాక్ మూవీ అని కూడా అంటున్నారు. ఊహించని ట్విస్ట్ లతో, అద్భుతమైన టేకింగ్ తో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాని ఎంతో చక్కగా తీర్చిదిద్దాడట. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుందట. తేజ్, సంయుక్త కెమిస్ట్రీ కూడా బాగా పండిందని అంటున్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాతో తేజ్ ఎలాంటి సంచలనలు క్రియెట్ చేస్తాడో చూడాలి.