బాల‌కృష్ణ‌పై మ‌న‌సుప‌డ్డ‌ సీనియ‌ర్ హీరోయిన్‌… ఛాన్స్ వ‌స్తే కోరిక తీర్చుకుంటానంటూ కామెంట్స్‌!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌పై ఓ సీనియ‌ర్ హీరోయిన్ మ‌న‌సుప‌డింది. ఛాన్స్ వ‌స్తే త‌న కోరిక తీర్చుకుంటానంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు ఖుష్బూ. టాలీవుడ్ మ్యాచో హీరో గోపిచంద్ హీరోగా తెర‌కెక్కిన `రామబాణం`లో ఖుష్బూ ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది.

‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా మే 5న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్ లో భాగంగా ఖుష్బూ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. రామ‌బాణం మంచి సందేశాన్ని అందించే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అని ఆమె తెలిపారు.

ఈ క్ర‌మంలోనే త‌న మ‌న‌సులో ఉన్న ఓ కోరిక‌ను కూడా రివీల్ చేసింది. తెలుగులో ఇప్పటికే వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో కలిసి నటించాను. అయితే బాల‌కృష్ణ లో మాత్రం క‌లిసి ప‌ని చేయలేదు. ఆయ‌న‌తో సినిమా చేయాల‌న్న కోరిక త‌న‌కు ఎప్ప‌టి నుంచో ఉంది.. త్వ‌ర‌లోనే ఆ ఛాన్స్ రావాల‌ని ఆశ‌ప‌డుతున్నాను` అని ఖుష్బూ పేర్కొంది. మ‌రి బాల‌య్య‌తో క‌లిసి న‌టించాల‌న్న ఖుష్బూ కోరిక ఎప్ప‌టికి నెర‌వేరుతుందో చూడాలి.