వామ్మో..వేణు స్వామి పూజల పేరుతో అలా చేస్తున్నాడా..? హీరోయిన్స్ కి మద్యం ఇస్తాడా..? బయటపడ్డ సంచలన నిజాలు..!!

వేణు స్వామి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి ఎంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. అలాంటి ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా వేణు స్వామి జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తూ స్టార్ట్ సెలబ్రిటీస్ ల లైఫ్ లో ఏం జరగబోతుందో అభిమానులకి కళ్లకు కట్టినట్లు చూపించేస్తున్నాడు . రీసెంట్ గానే వేణు స్వామి చెప్పిన ఓ విషయం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది .

ఇండస్ట్రీలో టాప్ హీరో గుండెపోటు కారణంగా మరణిస్తాడు అని ఎప్పుడో చెప్పాడు ఆయన . రీసెంట్గా టాలీవుడ్ నందమూరి హీరో తారకరత్న గుండెపోటు కారణంగా మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వేణు స్వామి ఏది చెప్తే అది జరుగుతుంది అని నమ్మేస్తున్నారు జనాలు. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా వైరల్ అవుతున్నాయి . జనరల్ గా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడా వేణు స్వామిని ఇంటికి పిలిపించుకొని మరి పూజలు చేస్తుంటారు . ఇప్పటికే నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన .. స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నిధి అగర్వాల్ వేణు స్వామిని ఇంటికి పిలిపించి పూజలు చేసుకుని సక్సెస్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి .

ఇలాంటి క్రమంలోని ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి . వేణు స్వామి పూజలలో మద్యం – మాంసం నైవేద్యంగా పెడతారట . వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం అంటున్నాడు వేణు స్వామి . ఆ మద్య పూజ చేయించుకున్న వాళ్లకి ప్రసాదంగా కూడా పెడతారట . అందులో దాపరికం ఏమీ ఉండదు అంటూ ఓపెన్గానే చెప్పుకు వచ్చేసాడు. ఈ విషయంలో ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే . కొందరు స్వామీజీలు పూజారులు మాత్రం తప్పు చేసిన సరే ఆ తప్పును కవర్ చేస్తారు . కానీ వేణు స్వామి ఉన్నది ఉన్నట్లు ఓపెన్ గా చెప్పేసాడు. ఎంత కాస్ట్లీ ముందు నైవేద్యంగా పెడితే అంత ఫలితం బాగుంటుందట. దేశంలోని అనేక ప్రముఖ దేవాలయాల్లో కూడా ఈ ఆచారం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ రకంగా చూస్తే వేణు స్వామి పూజలు చేయించిన ప్రతి ఒక్క హీరోయిన్ ముందు కొట్టిన్నట్లేగా అంటున్నారు అభిమానులు . చూడాలి మరి దీనిపై హీరోయిన్స్ ఏ విధంగా స్పందిస్తారో..? ప్రజెంట్ వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!