మన తెలుగు సినిమాగా వచ్చి ఇండియన్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ అందుకున్న భారీ చిత్రం త్రిబుల్ ఆర్. ఈ సినిమాతో హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కూడా తన స్టాండర్డ్స్ ని హాలీవుడ్ లెవెల్లో చాటగా లేటెస్ట్ గా అయితే హాలీవుడ్ లో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3, చేసి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న దర్శకుడు జేమ్స్ గన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒకవేళ ఎవరైనా భారతీయ నటులను గార్డియన్స్ ప్రపంచంలోకి తీసుకు రావాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ ఈ విధంగా సమాధానం ఇస్తూ.. ఎన్టీఆర్ గోప్ప నటుడని.. ఆర్ఆర్ఆర్ సినిమాలో వ్యాన్ లోనుంచి పులులు, వన్య మృగాలతో ఎన్టీఆర్ దూకే సన్నివేశం తనకు బాగా నచ్చిందని.. అందులో ఎన్టీఆర్ చాలా కూల్ యాక్టింగ్ చేశారని ప్రశంసించారు.
దీనితో ఈ క్రేజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. మరి దీనితో అయితే ఎన్టీఆర్ గ్లోబల్ క్రేజ్ తో తారక్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇక ఈ దర్శకుడు అయితే మార్వెల్ తో పాటలుగా డీసీ కామిక్స్ స్టూడియోస్ లో కూడా పలు భారీ సినిమాలు చేశారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు.