తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం.. సినిమాలు ధాటి వ్యక్తిగతంగా కూడా మంచి స్నేహితులుగా అయ్యిపోయారు. ప్రస్తుతం పవన్ నటిస్తున సినిమా వ్యవహారాలు కూడా దాదాపు అన్ని త్రివిక్రమే చూసుకుంటున్నాడు. తాజాగా ఇప్పుడు వీరిద్దరి స్నేహం గురించి త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ .. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆస్తికర వ్యాఖ్యలు చేసింది.
సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే సౌజన్య.. పవన్ మా ఇంటికి వస్తే మా వారు, పవన్ కళ్యాణ్ కబుర్లు చెప్పుకుంటారని కామెంట్లు చేశారు. ఇక వారు ఎక్కువగా పురాణాల గురించి, తత్వ శాస్త్రం గురించి వాళ్లిద్దరి మధ్య మాటలు ఉంటాయని సౌజన్య అన్నారు. . మావారు తన పుస్తకాలను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు, కానీ కళ్యాణ్ గారు అడిగితే మాత్రం కాదనకుండా ఇచ్చేస్తారు. వాళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఇచ్చుకునే బహుమతులు ఏమన్నా ఉన్నాయి అంటే అవి పుస్తకాలు, పెన్నులే మత్రమే.
ఇక పవన్ కళ్యాణ్ గారికి మా ఇంటి వంట అంటే ఎంతో ఇష్టమని ఆమె తెలిపారు. ఉప్మా అడిగి మరీ పవన్ చేయించుకుంటారని సౌజన్య చెప్పుకొచ్చారు. మధ్యాహ్న భోజనంలో అయితే వెజిటేరియన్ వంటలు, ఆవకాయ ఇష్టంగా తింటారు. అలాగే ఊరగాయలు, రవ్వలడ్డూలు అడిగి మరీ తింటారు. అడగడానికి అస్సలు సిగ్గుపడరు. మా ఇంటిలో మనిషిలా కలిసిపోతారు అంటూ చెప్పుకొచ్చింది.
ఈ మధ్య కాలంలో సౌజన్య పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. సౌజన్య ప్రొడ్యూసర్ గా మరింత సక్సెస్ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. సౌజన్య నిర్మాతగా కూడా మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.