బాడీ షేమింగ్‌పై పెదవి విప్పిన చెర్రీ భార్య.. ఆ ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్ అంటూ!

టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తెలియని వారు ఎవరూ ఉండరు. అతని భార్య ఉపాసన కామినేని కొణిదెల కూడా సుపరిచితురాలే. కాగా తాజాగా ఆమె తన పెళ్లయిన మొదట్లో బాడీ షేమింగ్‌కు గురైన అనుభవాన్ని వెల్లడించారు. ఉపాసన ఆమె తన అభిప్రాయాలు, నమ్మకాల గురించి ఎప్పుడూ మాట్లాడుతుంది.

ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో, ఉపాసన తన బరువు, బాడీ షేప్ గురించి వస్తున్న ట్రోల్స్ తనను ఎలా బాధించాయో చెప్పుకొచ్చింది. తన బరువు, శరీర ఆకృతి గురించి ప్రజలు తరచుగా మాట్లాడుతూ ఉంటారని, అదంతా తన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె చెప్పింది. నెగిటివ్ కామెంట్స్ ఎదుర్కోవడం మొదట్లో తనకు చాలా కష్టమైందని… కాలక్రమేణా వాటిని పట్టించుకోకపోవడం నేర్చుకున్నానని ఉపాసన పేర్కొంది. ఇతరులు ఏమనుకుంటున్నారు, వారు ఏం మాట్లాడుతున్నారో పట్టించుకోకుండా సొంత పని, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ముఖ్యమని చెర్రీ సతీమణి తెలిపింది.

సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ పై ట్రోలింగ్‌తో చాలా మంది వ్యక్తులు, ముఖ్యంగా మహిళలు బలవుతున్నారు. ఇక హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఉపాసన రామ్‌తో తనకున్న సంబంధం గురించి మాట్లాడింది. అతను తనకు నిరంతరం మద్దతు ఇస్తున్నాడని చెప్పింది. ఆస్కార్ గెలిచుకునే చారిత్రాత్మక క్షణానికి రామ్‌కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని, ఆస్కార్ ప్రచారంలో రామ్‌తో కలిసి ఉండటం తనకు చాలా ముఖ్యంగా మారిందని ఉపాసన వివరించింది. అందుకే తనతో కలిసి అమెరికా వెళ్లానని చెప్పింది. ఆర్‌ఆర్‌ఆర్ బృందం ఒక కుటుంబంలా మారిందని, అకాడమీ అవార్డుల సందర్భంగా లాస్ ఏంజిల్స్‌లో ఉన్న అనుభవం కలలా అనిపించిందని, ఆ ఎక్స్‌పీరియన్స్ అమేజింగ్ అంటూ! తెలిపింది.