తెలుగులో మరో జాక్ పాట్ ఆఫర్ అందుకున్న జాన్వీ.. ఈసారి ఏకంగా డబుల్ ధమాకా..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ ప్రజెంట్ తెలుగు ఇండస్ట్రీలోనూ తన హవా కొనసాగిస్తుంది . ఇన్నాళ్లు జాన్వి కపూర్ తెలుగు ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా ..? అంటూ ఈగర్ గా వెయిట్ చేసిన శ్రీదేవి అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ వినిపించాడు డైరెక్టర్ కొరటాల శివ . ఎన్టీఆర్ థర్టీ సినిమాలో ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేస్తూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు .

రీసెంట్ గానే జాన్వి కపూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ – జాన్వి కపూర్ పేయిర్ తెరపై ఎలా ఉండబోతుందో అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశగా వెయిట్ చేస్తున్నారు . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తెలుగులో మరో జాక్ పాట్ ఆఫర్ అందుకుంది జాన్వి కపూర్ అంటూ సినీ వర్గాలలో ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. మెగా పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న రాంచరణ్ – బుచ్చిబాబు సన డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ జూన్ లో మొదలవుతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది . కాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా హీరోయిన్గా జాన్వికపూర్ ఫిక్స్ చేశారట డైరెక్టర్ . అంతేకాదు ఈ సినిమా కోసం అమ్మడు ఎన్టీఆర్ సినిమా కన్నా డబల్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . గ్లోబల్ హీరో గా పేరు సంపాదించుకున్న చరణ్ తో నటించే గొప్ప అవకాశం అనుకుంటుంటే.. ఇలా అడిగినంత ఇవ్వడానికి కూడా మేకర్స్ ఓకే చేశారట . ఈ క్రమంలోనే జాన్వి కపూర్ కి బీభత్సంగా లక్ రాసి పెట్టిందని.. ఇక తెలుగులో ఆపే వాడే లేడు అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!