గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫ్యామిలీ పరువు ఏ రేంజ్ లో డి గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారో కొందరు ఆకతాయిలు మనకు తెలిసిందే. నిహారిక విడాకులు తీసుకోబోతుంది అంటూ ఓ న్యూస్ తెగ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పటివరకు దీనిపై మెగా ఫ్యామిలీ గాని జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీ కాని స్పందించలేదు . ఇదే క్రమంలో మెగా అభిమానులు సైతం ఫుల్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. లేక లేక మెగా ఫ్యామిలీలో వారసుడు రాబోతుంటే ఇలాంటి తలనొప్పులు ఏంట్రా బాబు అంటూ మండిపడుతున్నారు.
కాగా రీసెంట్గా అలా విసుగెత్తిపోయిన మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందించింది మెగా కోడలు పిల్ల ఉపాసన . అపోలో హాస్పిటల్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మనవరాలుగా మెగా వారంట కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఉపాసన పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . ఎంత ఎదిగినా సరే చరణ్ భార్య గానే పిలవాలి అంటూ అప్పుడే తనకి ఆనందం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చే ఉపాసన . మెగా ఇంటి పరువును డబల్ చేసింది .
రీసెంట్గా ఇటీవల మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022 – 23 జాబితాలో ఒకరుగా నిలిచారు ఉపాసన కొణిదెల . ఆస్కార్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న మెగా ఫ్యామిలీకి నిహారిక డివోర్స్ న్యూస్ మింగును పడని రాయిగా మధ్య నలిగిపోతుంది . ఈ క్రమంలోనే అలాంటి అభిమానులకు ఉపాసన మరో గుడ్ న్యూస్ అందించింది . ఇదే విషయాన్ని అఫీషియల్ గా షేర్ చేస్తూ ఈ అవార్డు లభించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ చెప్పకు వచ్చింది. ఉపాసన ఇంత గ్రేట్ అవార్డు అందుకోవడం పట్ల పలువురు నెటిజెన్లు మెగా ఫ్యాన్స్ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు . కాగా ఉపాసన చేసిన సేవలకు గాను ఈ అవార్డు లభించినట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీని కృతజ్ఞతలు తెలుపుతూ కూడా కోడలు పిల్ల ట్వీట్ చేసింది ..!!
Thank u @EconomicTimes for featuring me as one of the Most Promising Business Leaders of Asia 2022-23. pic.twitter.com/fP39b2zQTi
— Upasana Konidela (@upasanakonidela) March 23, 2023