చిత్ర పరిశ్రమ అంటేనే ఓ వింత ప్రపంచం. ఏ హీరో అయినా ఓ సినిమాతో విజయం సాధిస్తే మళ్లీ అదే తరహా పాత్రలు ఆయనకు వస్తూ ఉంటాయి. మళ్లీ అదే తరహా పాత్రలు చేయాలంటే ఆ హీరోకి ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ప్రేక్షకులు కూడా ఆ హీరోని అదే పాత్రలో చూడడానికి అలవాటు పడిపోతారు. పోనీ ఆ సినిమా చేయకుండా వదిలేద్దామా అంటే కెరీర్ బిగినింగ్ లో హీరో కథ నచ్చలేదు అంటాడా అని సదరునిర్మాణ సంస్థ వారికి కోపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మళ్లీ మరోసారి సినిమా అవకాశం వస్తుందా లేద అనే భయం కూడా ఉంటుంది.
అయితే ఇలాంటి క్లిష్టమైన విషయాలలో ఎంతో చాకచక్యంగా వ్యవహరించే హీరోలలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా చెప్పుకునే సీనియర్ ఎన్టీఆర్ అక్కినేని నాగేశ్వరరావు. ఇక వీరిద్దరిలో ఎన్టీఆర్ కంటే నాగేశ్వరరావు ముందుగా చిత్ర పరిశ్రమలోకి వచ్చారు. నిజానికి ఎన్టీఆర్ కంటే కూడా అక్కినేనికే ఎక్కువ విజయాలు ఉన్నాయి.
అయితే అక్కినేని దేవదాసు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తర్వాత చాలామంది దర్శకులు అలాంటి కథలు పట్టుకుని అక్కినేనితో సినిమాల్లు చేయ్యాడానికి వచ్చారు. అందుకు అక్కినేని ఏం మాత్రం ఒప్పుకునే వారు కాదట. ఆ మూస పాత్రలలో కొట్టుకుపోవాలని ఆయన అసలు అనుకోలేదు.
అప్పుడు అదే సమయంలో ఎన్టీఆర్- సావిత్రి హీరో హీరోయిన్లుగా వచ్చిన కామెడీ మూవీ మిస్సమ్మలో కమెడియన్ లాంటి డిటెక్టివ్ పాత్రను అక్కినేని అడిగి మరీ నటించారట. ముందుగా అందుకు ఆ సినిమా నిర్మాతలు ఒప్పుకోకపోయినా అక్కినేని బలవంతం చేయడంతో వారు నో చెప్పలేకపోయారట.అలా ఆ సినిమాలో అడిగి మరి అక్కినేని నటించి తన కామెడీతో మెప్పించారు.