రంగమార్తాండ సినిమాలో అదే హైలెట్.. ఆ ఒక్క పాయింట్ లేకుంటే!!

ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా రంగమార్తాండ. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు కాలిపు మధు, ఎస్ వెంకట్ రెడ్డి నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నట సామ్రాట్’ సినిమాని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రీమేక్ చేసారు.

ఈ సినిమా నుంచి విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అంతేకాకుండా పాటలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమాకి రెస్పాన్స్ ఎలా ఉంది అనే దానిగురించి తెలుసుకుందాం.

కథ: కథ విషయానికి వస్తే ప్రకాష్ రాజ్ -రాఘవరావు పాత్రలో నటించాడు. ఆయన ఒక కళాకారుడు అయిన కారణంగా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దీంతో ఆయన అభిమానులు రంగమార్తాండ అనే బిరుదును ప్రధానం చేస్తారు. కానీ ఆ సమయంలో తను రిటైర్మెంట్ తీసుకుంటాను అని అందర్నీ నిరాశ పరుస్తాడు. ఇక తన ఆస్తులను పిల్లలకు పంచి ఇస్తాడు. ఇక కొడుకు రంగారావు (ఆదర్శ్), కోడలు గీత (అనసూయ) లకు ఇంటిని, కూతురు శ్రీ (శివాత్మిక) కు పిక్స్ డిపాజిట్ చేసిన సొమ్మును ఇస్తాడు. అంతేకాకుండా ఆమె ప్రేమించిన వ్యక్తి రాహుల్ సిప్లిగంజ్ తో పెళ్లి కూడా చేయిస్తాడు. ఇక తన భార్య రమ్యకృష్ణతో సంతోషంగా గడపాలని అనుకుంటాడు. కానీ చివరికి తను అనుకున్నట్లుగా తన జీవితం ఆనందంగా సాగుతుందో లేదో? బ్రహ్మానందంకు తనకు ఉన్న సంబంధం ఏంటి? చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథ.

టెక్నికల్ అస్పెక్ట్స్‌ విషయానికి వస్తే, దర్శకుడు ఈ సినిమాకు మంచి కథను అందించాడు. ఇళయరాజా సంగీతం బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది. మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ: కథ ప్రారంభంలో నెమ్మదిగా సాగినట్లు అనిపించిన కూడా ఆ తర్వాత వచ్చే సీన్లు ఎమోషన్స్ గా, ఆసక్తికరంగా చూపించాడు డైరెక్టర్. ఇంటర్వెల్ ముందు మాత్రం బాగా ఎమోషనల్ గా చూపించాడు. భార్యాభర్తల మధ్య సన్నివేశాలు కూడా అద్భుతంగా చూపించాడు. కొన్ని సన్నివేశాలతో ప్రేక్షకులకు కంటతడి పెట్టించాడు.

సినిమా కథ, నటీనటుల నటన, సంగీతం, ఇంట్రెస్టింగ్ సన్నివేశాలు, ఎమోషన్స్, క్లైమాక్స్ అనేవి సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిస్తే, ఈ కథలో కొన్ని సీన్స్ చాలా స్లోగా ఉండటం సినిమాకి మైనస్ పాయింట్స్ గా చెప్పుకోవచ్చు.

బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా మంచి ఎమోషనల్ తో కూడిన కుటుంబ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ కూడా డైరెక్టర్ అంతకంటే గొప్ప కథగా తెరకెక్కించాడు ఈ సినిమాను. కాబట్టి ఈ సినిమాను కచ్చితంగా చూడాల్సిందే.