“తూ మీ బ్రతుకులు చెడ”.. తెలుగు హీరోల పరువు తీసేసిన దీపిక పదుకొనే..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోని మించిపోతున్నారు బాలీవుడ్ బ్యూటీలు . మరీ ముఖ్యంగా రెమ్యూనరేషన్ విషయంలో తెలుగు స్టార్ హీరోలకి మించి ధీటైన రేంజ్ లో బాలీవుడ్ ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . కాగా రీసెంట్గా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే ప్రాజెక్టుకె సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి . మనకు తెలిసిందే మహానటి సినిమా ద్వారా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తన ఖాతలో వేసుకున్న నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ప్రాజెక్టుకె.

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న ఈ సినిమాలో బిగ్ బి లాంటి స్టార్ నటుడు కూడా నటిస్తున్నాడు . ఈ క్రమంలోని అందాల ముద్దుగుమ్మ దీపిక పదుకునే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కాగా ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా 15 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది . ఇప్పటివరకు ఈ రేంజ్ లో హైయెస్ట్ పారితోషకం తీసుకున్న అందాల ముద్దుగుమ్మ ఎవరూ లేరు అంటూ తెలుస్తుంది . నయనతార కూడా హైయెస్ట్ గా 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంది . అయితే ఎవ్వరు ఊహించిన విధంగా దీపికా పదుకొనే.. ఈ సినిమా కోసం 15 కోట్లు చార్జ్ చేస్తుండడం ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది.

అంతేకాదు మన టాలీవుడ్ యంగ్ హీరోస్ కూడా ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకోరు . నాగచైతన్యా,నాని, నితిన్ లాంటి వాళ్లు కూడా 10 -12 -13 తోనే సరిపెట్టుకుంటున్నారు . అయితే దీపికా పదుకొనే మాత్రమే 17 కోట్లు తీసుకుంటూ ఉండడం సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అసలు రష్మిక మందన , పూజ హెగ్డే , సమంత లాంటి వాళ్ళు అమ్మడు దరిదాపుల్లోనే లేరు . ఒక్కొక్కరు సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు . ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ జనాలు తెలుగు హీరోలను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు మీ బ్రతుకులు చెడ అంటూ పరోక్షకంగా తెలుగు హీరోలకి కౌంటర్ వేస్తున్నారు . దీపికా పదుకొనే తీసుకునే రెమ్యూనరేషన్ తో కంపేర్ చేస్తే మిగతా హీరోలు దండగ అని చెప్పకనే ..సదరు హీరోలను టార్గెట్ చేసి ట్రోల్ చేయడం ఇప్పుడు తెలుగు జనాలకు హర్టింగ్ గా అనిపిస్తుంది.