ఆ ప్ర‌ముఖ ఆల‌యంలో స‌మంత పూజ‌ల వెన‌క కార‌ణం ఇదే…!

స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ప్రతిరోజు ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నిలుస్తూ వచ్చింది. అక్కినేని యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుని తర్వాత కొద్ది రోజులకే విడిపోయినప్పటి నుంచి సమంత పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా నిలుస్తూ వచ్చింది. ఇక రీసెంట్ గానే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడిన సమంత ప్రస్తుతం ఆ వ్యాధి నుంచి కోలుకుని తిరిగి తన సినిమాలో షూటింగ్లో పాల్గొంటుంది.

ఈ విషయం ఇలా ఉంచితే తాజాగా ఆమె తమిళనాడులోని పళని మురుగన్ ఆలయాన్ని దర్శించింది. ఈ క్రమంలోనే ఆ గుడి కొండ కింద నుంచి సుమారు 600 మెట్ల వరకు హారతి వెలిగించీ ప్రత్యేక పూజలు చేసింది. రీసెంట్ గానే సమంతకు వచ్చిన వ్యాధి నుంచి కోలుకోవడంతో ఇలా తన మొక్కులను చెల్లించుకుంటూ వస్తుందని సమాచారం.

ఇప్పుడు ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సమయంలోనే చైతూతో విడాకులు తీసుకున్న సమయంలో కూడా సమంత ఎక్కువగా ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసి పలు ఆలయాలను దర్శించిన విషయం తెలిసిందే.

ఇక సమంత నటించిన తాజా చిత్రం శాకుంతలం ఏప్రిల్‌ 14న విడుదలకు సిద్ధమైంది. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇటు విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీతో పాటు, హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ లోనూ నటిస్తోంది.