`వీర సింహారెడ్డి` క్లోజింగ్ క‌లెక్ష‌న్స్‌..ఫైన‌ల్ గా ఎంత రాబట్టిందో తెలుసా?

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన చిత్రాల్లో నట‌సింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒక‌టి. గోపీచంద్ మ‌లినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఇందులో బాల‌య్య ద్విపాత్రాభినయం చేశారు. శృతిహాసన్, హ‌నీరోజ్‌ హీరోయిన్లు నటించారు.

భారీ అంచ‌నాల న‌డుమ ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. అయితే టాక్ ప‌రంగా ఈ సినిమా అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో విఫ‌లం అయింది. కానీ, క‌లెక్ష‌న్స్ ప‌రంగా దుమ్ము దులిపేసింది. తాజాగా ఈ మూవీ క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. రూ. 75 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. థియేట‌ర్స్ వ‌ద్ద టోట‌ల్ ర‌న్ ముగిసే స‌మ‌యానికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ. 75.90 కోట్లు రాబ‌ట్టి క్లీన్ హిట్ గా నిలిచింది.

ఆంధ్రా,తెలంగాణా కలిసి రూ. 65.50 కోట్లు, ఓవర్సీస్ రూ. 5.85 కోట్లు, రెస్టాఫ్ ఇండియా రూ. 4.55 కోట్లు వచ్చింది. ఇక ఓటిటి రైట్స్, శాటిలైట్ రైట్క్, హిందీ రైట్స్ అదనం. వాటి ద్వారా భారీగా నిర్మాతకు భారీగా లాభాలు వ‌చ్చాయి. కాగా, త్వ‌ర‌లోనే ఈ మూవీ ఓటీటీ సంద‌డి చేయ‌బోతోంది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ `వీర సింహారెడ్డి` ఫిబ్రవరి 23 సాయంత్రం 6 నుంచి ప్రేక్షకులకు అందుబాటులో రాబోతోంది.