ఓరి నీ వేషాలో .. అమెరికాలో జో బైడెన్ కి ఆర్పీ చేపల పులుసు..ఇంతకన్నా కామెడీ ఉంటుందా..?

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో జబర్దస్త్ ఒకప్పటి కమెడియన్ కిర్రాక్ ఆర్పి పేరు ఏ రేంజ్ లో ట్రోలింగ్కి గురవుతుందో అందరికీ తెలిసిందే. జబర్దస్త్ పుణ్యమా ఆంటీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక మరింత రేంజ్ లో ఆయన పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. కాగా రీసెంట్గా ఆయన హైదరాబాద్లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఓ కర్రీస్ పాయింట్ ని స్టార్ట్ చేశారు. ఎవరు ఊహించని విధంగా చాలా తక్కువ టైంలోనే ఈ చేపల పులుసుకి బాగా పేరొచ్చింది.

 

ఫుల్ డిమాండ్ ఏర్పడింది.. ఎంతలా అంటే అటువైపుగా వెళ్తున్న జనాలకు ఇబ్బందికరంగా ఉండే అంత విధంగా.. జనాలు ఆ చేపల పులుసు కోసం ఎగబడి లైన్లో నిలుచొని మరి కొనుక్కున్నారు .. అంత స్పెషాలిటీ ఏముందో ఆ చేపల పులుసు తిన్న వాళ్లే చెప్పాలి అంటూ కౌంటర్లు కూడా వేశారు . కాగా రీసెంట్గా మణికొండ లోను నెల్లూరు చేపల పులుసు బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు .

ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ ..”నా బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వడానికి చాలామంది హెల్ప్ చేశారు .. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాను ..జబర్దస్త్ తో నాతోపాటు ఎదిగిన అదిరే అభి అమెరికాలో కూడా ఈ చేపల పులుసు పెట్టాలని కోరుకుంటున్నాడు ..కచ్చితంగా త్వరలోనే అక్కడ కూడా అమెరికన్లకు కూడా చేపల పులుసు టేస్ట్ రుచి చూపిస్తాను ..కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. కొద్దిగా అనుభవం మ్యాన్ పవర్ పెరిగాక బ్రాంచ్ ను ఓపెన్ చేస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే పలువురు ఆర్పీ ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు ఇంకేందు “నీ వేషాల్లో ఇక లేట్ ఎందుకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కి కూడా చాపల పులుసు టేస్ట్ చేయించు.. ఇంతకన్నా కామెడీ ఉంటుందా..?” అంటూ సెటైర్స్ వేస్తున్నారు..!!