చిరంజీవిలో ఆ రెండు నాకు న‌చ్చ‌వు.. వైర‌ల్‌గా మారిన ప‌వ‌న్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్ తో స్టార్ హోదాను అందుకున్నాడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అన్నకు మించిన ఇమేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఇక‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బాల‌య్య హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే.

రెండు పార్టులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ప‌వ‌న్ నుంచి బాల‌య్య ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను రాబ‌ట్టి ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. ఈ క్ర‌మంలోనే పవ‌న్ క‌ళ్యాణ్ త‌న అన్న‌య్య చిరంజీవిలో న‌చ్చిన మ‌రియు న‌చ్చ‌ని విష‌యాల‌ను రివిల్ చేశాడు. `చిరంజీవి అన్న‌య్య‌కు మొహమాటం ఎక్కువ.. అది నాకు న‌చ్చ‌దు. పైగా అది రాజకీయాలకు పనికిరాదు కాబట్టి నేను దానికి దూరంగా ఉంటాను.

అలాగే అన్నయ్య అతి మంచితనం కూడా నాకు నచ్చదు.. దాని వల్ల ఆయన చాలా నష్టాలను ఎదుర్కొన్నారు` అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక చిన్నప్పటి నుండి అన్నయ్య దగ్గర నుండి కష్టపడే తత్త్వం నేర్చుకున్నాని, ఎలాంటి వనరులు లేని రోజుల్లోనే ఆయన 3 షిఫ్టులుగా పనిచేసేవార‌ని, షూటింగ్స్ లో తగినన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు లేని రోజుల్లో ఆయన ఫైట్స్ చేసి గాయపడేవార‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు.