రానా ద‌గ్గుబాటిపై క్రిమినల్ కేసు.. తండ్రితో స‌హా అడ్డంగా ఇరుక్కున్న హీరో!

టాలీవుడ్ హీరో రానా ద‌గ్గుబాటిపై క్రిమిన‌ల్ కేసు న‌మోదు అయింది. తండ్రి, ప్ర‌ముఖ బ‌డా నిర్మాత సురేష్ బాబుతో స‌హా రానా ఫిలింనగర్‌లోని ఓ స్థలం వివాదంలో అడ్డంగా ఇరుకున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీలోని 1007 గజాల స్థలం అమ్మకం విషయంలో సురేశ్‌బాబు ఒప్పందం అమలు చేయడం లేదని..తమ వద్ద డబ్బు తీసుకుని రిజిస్ట్రేషన్‌ చేయడం లేదంటూ బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి ప్రమోద్‌ కుమార్‌ పచ్వా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రౌడీల సాయంతో దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారు అని ప్రమోద్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తెలిపాడు. అయితే ఫిర్యాదు చేసినా పోలీసులు ఈ కేసు పట్టించకోక‌పోవ‌డంతో.. ప్ర‌మోద్ కుమార్ నాంపల్లి కోర్టులో ప్రైవేట్‌ ఫిర్యాదు దాఖలు చేశారు.

దీనిని కాగ్నిజెన్స్‌గా తీసుకున్న కోర్టు.. సురేశ్‌బాబు, రానా వ్యక్తిగతంగా హాజరుకావాలని జనవరి 19న సమన్లు జారీచేసింది. విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ వ్యవహారం పై గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో.. ఈ వివాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.