NTR 30 Official announcement : ఫైనల్లీ..అదే క్రేజీ హీరోయిన్ ని ఫిక్స్ చేసిన కొరటాల శివ..ట్వీట్ వైరల్..!!

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఈగర్ గా ఎదురుచూసిన అప్డేట్ ఎట్టకేలకు కొరటాల శివ రివీల్ చేశాడు . మనకు తెలిసిందే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాబోలో ఓ సినిమాని సెట్ చేశారు . కాగా ఎప్పుడో అధికారిక ప్రకటన వచ్చిన ఇప్పటివరకు ఈ సినిమాపై అప్డేట్ ఇవ్వనేలేదు ఎన్టీఆర్ . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు.

కాగా ఎట్టకేలకు కొరటాల శివ అలాంటి ఫ్యాన్స్ ను ఖుషి చేస్తూ ఎన్టీఆర్ థర్టీ సినిమాలో హీరోయిన్ పై అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. ముందు నుంచి అనుకున్నట్లు ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన జాన్వి కపూర్ ని హీరోయిన్గా సెలక్ట్ చేసుకున్నాడు. అదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు డైరెక్టర్ కొరటాల శివ . అంతే కాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కకబోతుంది అని కూడా చెప్పేసాడు. మొత్తానికి ఏప్రిల్ 5న ఈ సినిమా తెలుగు , కన్నడ ,మలయాళం , హిందీ భాషలలో రిలీజ్ కాబోతుంది .

అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ పక్కన రష్మిక మందన పేరును సెలెక్ట్ చేసుకున్నారట కొరటాల శివ . అయితే టీం మాత్రం రష్మిక మందనాను కన్నడలో బ్యాన్ చేసే విధంగా కన్నడ ఇండస్ట్రీ ముందుకు వెళుతుందని ..ఒకవేళ రష్మిక ను పెట్టుకుంటే మన సినిమా కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ చేసేందుకు లీగల్ ఇష్యూస్ వస్తాయని సజెషన్స్ ఇస్తున్నారట. ఈ క్రమంలోనే రష్మిక మందన కు 50-50 ఛాన్సెస్ అవకాశాలున్నాయి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తంగా శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఎంట్రీ నందమూరి వారసుడితో సెట్ అయింది అంటూ ఫుల్ ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్..!!