ఆ తెలుగు డైరెక్టర్ పై రీవేంజ్ తీర్చుకుంటున్న పుజా హెగ్డే .. అంతలా నమ్మించి మోసం చేసాడా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజ హెగ్డే ..ప్రస్తుత కెరియర్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏది ముట్టుకున్న బ్లాస్ట్ అయిపోతుంది . పాపం కెరియర్ కొత్తల్లో ఒక సినిమా హిట్ కొట్టడానికి ..నాన్న తంటాలు పడిన పూజ హెగ్డే .. ఎట్టకేలకు దువ్వాడ జగన్నాథం సినిమాతో పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది . ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద రాఘవ వీర సమేత సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే ని అందరూ అదృష్ట దేవతగా భావించారు .

అప్పటివరకు ఐరన్ లెగ్ అంటూ ట్యాగ్ చేసిన జనాలే అమ్మడును లక్కీ హీరోయిన్ అంటూ పొగిడేసారు. ఈ క్రమంలోనే ఆమెకు హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ను పూజా హెగ్డే దేవుడిలా భావించింది . ఇక తర్వాత మళ్లీ అలా వైకుంఠపురం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు రుణం తీర్చుకోలేను అంటూ భారీ భారీ డైలాగ్స్ కొట్టింది పూజ హెగ్డే . మళ్లీ ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు డైరెక్టర్ .

అయితే ఈ సినిమాలో మొదటి నుంచి పూజా హెగ్డే క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుందని ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇవ్వాలని అనుకున్నారట. సీన్ కట్ చేస్తే శ్రీలీల సెకండ్ హీరోయిన్గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత .. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు స్క్రిన్ ప్లే మొత్తం చేంజ్ చేసాడట. మొదటి హీరోయిన్ గా ఉండాల్సిన పూజా హెగ్డే సెకండ్ హీరోయిన్గా చేసి డామినేషన్ మొత్తం శ్రీలీలకే ఇచ్చేసారట . ఈ క్రమంలోనే నమ్మిన డైరెక్టర్ ని చిట్ చేయడంతో త్రివిక్రమ్ పై పూజ గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది . అంతే కాదు రివేంజ్ తీర్చుకోవడానికి సరైన టైమ్ కోసం చూస్తుందట . వన్స్ టైం దొరికిందా కరెక్ట్ పాయింట్ తో కొడతాను అంటూ పూజ తన ఫ్రెండ్స్ వద్ద చెప్పుకొచ్చినట్టు న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!