నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న `ఆహా` ఓటీటీ ఎక్స్క్లూజివ్ టాక్ షో `అన్స్టాపబుల్` సెకండ్ సీజన్ కూడా సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ షో ఫైనల్ ఎపిసోడ్కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో పార్ట్ గురువారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
మొదటి పార్ట్ మాదిరిగా రెండో భాగం కూడా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఫస్ట్ పార్ట్ లో సాయి ధరమ్ తేజ్ మెరవగా.. సెకండ్ పార్ట్లో డైరెక్టర్ క్రిష్ సందడి చేశారు. వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా టచ్ చేస్తూ బాలయ్య ప్రశ్నలు సంధించడం.. వాటిని పవన్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పడం ఆకట్టుకుంది.
అయితే ఈ షో వేదికగా మెగా, నందమూరి ఫ్యాన్స్కి పూనకాలు తిప్పించే అప్డేట్ రివిల్ అయింది. అదేంటంటే.. బాలయ్య, పవన్ కాంబోలో మల్టీస్టారర్ రాబోతోంది. షోలో బాలయ్య తనతో మల్టీస్టారర్ చేస్తావా అని ప్రశ్నించగా.. అందుకు క్షణంగా ఆలోచించకుండా పవన్ ఎస్ చెప్పేశారు. పక్కనే ఉన్న క్రిష్ టక్కున `కథ రెడీ! చెప్పవచ్చా?` అని ప్రశ్నించాడు. అందుకు బాలయ్య `ఓ పని చేద్దాం! 2024లో చేద్దాం! మామూలుగా ఉండదు.` అంటూ పేర్కొన్నారు. ఏదేమైనా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య, పవన్ కళ్యాణ్ కాంబోలో ఓ మల్టీస్టారర్ పడితే బాక్సాఫీస్లు బద్దలే అంటూ సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.