కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హై బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్ కుమార్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, శ్యామ్, జయసుధ, ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు.
సంక్రాంతి కానుక జనవరి 12న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. మరోవైపు మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై మరింత హైప్ను పెంచుతున్నారు. ఇలాంటి తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ బిగ్ బ్రేకింగ్ బయటకు వచ్చింది. అదేంటంటే.. `వారసుడు` విడుదల వాయిదా పడబోతోందట. అయితే ఇక్కడ కాదులేండి. యూఎస్ఏలో అని అంటున్నారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ ఛానెల్ శ్లోక్ సినిమాస్ వరిసు/వారసుడు ఓవర్సీస్ పంపిణీ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది. అయితే యూఎస్ఏలో ఈ సినిమా తెలుగు వెర్షన్ విడుదల ఒకటి లేదా రెండు రోజులు ఆలస్యం కావచ్చని తాజాగా టాక్ బయటకు వచ్చింది. ఖచ్చితమైన కారణం తెలియకపోయినా.. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందని అంటున్నారు. కాగా, వారసుడు కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు మాగ్జిమమ్ స్క్రీన్స్ను బ్లాక్ చేశాడు. మరోవైపు తమిళనాడులోనూ ఈ మూవీ భారీ ఎత్తున విడుదల కాబోతోంది.